Wednesday, 14 March 2018

రిటైల్‌ జాబ్‌ ఇంటర్వ్యూ..సూటైతే సెట్‌ కావచ్చు


రిటైల్‌ జాబ్‌ ఇంటర్వ్యూ..సూటైతే సెట్‌ కావచ్చు


భారత దేశంలో అత్యంత వేగంగా దూసుకువెళుతున్న వాటిలో రిటైల్‌ రంగం ఒకటి. జిడిపిలో దీని వాటా పదిశాతం. ఉద్యోగుల్ల్లో ఎనిమిది శాతం మంది ఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. రిటైల్‌ స్పేస్‌కు సంబంధించి ప్రపంచంలోనే అయిదో స్థానంలో భారత్‌ ఉంది. దేశ ప్రజలు ప్రధానంగా మధ్యతరగతి వినియోగ ధోరణిలో వచ్చిన మార్పులు ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నాయన్నది మార్కెట్‌ పరిశోధకుల విశ్లేషణ. ఇదంతా సరే, ఏటా పన్నెండు శాతం ఎదుగుదలను ఊహిస్తున్న రిటైల్‌ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటే ఏమి చేయాలన్నది ముఖ్యమైన ప్రశ్న. సంబంధిత ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలన్నది మరో అంశం. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణుల సూచనలు చూద్దాం...
 
ప్ర: రిటైల్‌ రంగంలో గతంలో పని చేశారా?
జ: ఉదాహరణకు రిటైల్‌ రంగంలో పని చేయలేదనే అనుకుందాం. అది నేరుగా ఉత్పత్తి కానక్కర్లేదు. విషయం ఆసాంతం వివరించి ఎదుటి వ్యక్తి లేదంటే స్నేహి తుడిని సమాధానపర్చడం కావచ్చు. అదీ కాదనుకుంటే పేరెంట్స్‌ను ఒప్పించడం కావచ్చు. ఆ రెంటిలో ఏదైనా అమ్మకం కిందే పరిగణించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఒప్పించే కళ మీకు ఉంది. అదే మీ సామర్థ్యం. ఇక్కడ ఎలా సమాధానం చెప్పాలంటే.... ఇంతవరకు అనుభవం లేదు. అయితే నా ఆసక్తులు ఈ రంగంలో పనిచేసేందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నాను. వ్యక్తుల్ని కలవడం నాకు సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాషన్‌ ప్రపంచంపై అప్‌టు డేట్‌గా ఉంటాను. మా చుట్టాలు, మిత్రులు దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు నన్ను సంప్రదిస్తుంటారు. ఇలాంటి సమాధానాలతో ఆకట్టుకోవచ్చు.
 
ప్ర: వారానికి కనీసం పదహారు గంటలపైగా పని చేయ గలరా?
జ: సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను కాలేజీ చదువుతూ ఉద్యోగం కోసం వచ్చేవారిని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబులో నిజాయతీ కనిపించాలి. మీ వెసులుబాటుని అనుసరించి సమాధానం చెప్ప గలగాలి. మొన్నటి వేసవి కాలంలో పూర్తి స్థాయిలో పని చేశాను. మళ్ళీ సెమిస్టర్‌ ఆరంభమైన తరవాత పార్ట్‌టైమ్‌ షెడ్యూల్‌ ఎంచుకున్నాను. కాలేజీ నాకు చాలా ముఖ్యం. అలాగే కమిట్‌మెంట్‌ విషయంలో సీరియ్‌సగానే ఉంటాను. అంగీకరించిన పనిని పూర్తి చేసే ఇంటికి వెళతాను.
 
ప్ర: షిఫ్టుల్లో పని చేయగలరా? లేట్‌ నైట్స్‌ ఉండగలరా? ఉదయాన్నే డ్యూటీకి రాగలరా? వీకెండ్స్‌ పనిచేయ మంటే కుదురుతుందా?
జ: పై ప్రశ్నమాదిరిగానే ఇది కూడా ఉంటుంది. పని విషయంలో మీరెంత సీరియస్‌ అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న అడగడంలోని ఉద్దేశం. మీలో నిజాయతీపాళ్ళు ఎంతో కనుగొనడం మరో లక్ష్యం. షిఫ్టుల్లో పని చేయడం నాకు సమస్య కాదు. చాలా దూరం నుంచి నేను ఇక్కడికి రావాలి. అందువల్ల నేను నైట్‌ డ్యూటీలను ప్రిఫర్‌ చేస్తాను. ఉదయమే రావడం కొద్దిగా కష్టమే. అవసరమైతే వీకెండ్స్‌లో పని చేయడానికి అభ్యంతరం లేదు అని చెప్పవచ్చు.
 
ప్ర: మిమ్మల్ని మేం ఎందుకు తీసుకోవాలి?
జ: ఇది అన్ని జాబ్‌లకూ వర్తిస్తుంది. ఇంటర్వ్యూలోనే ఈ ప్రశ్నకు చాలా వరకు సమాధానం చెప్పారు. బ్రాండింగ్‌, ఫ్యాషన్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. ఇంకా లోతుగా ఈ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వ్యక్తిని. అమ్మకాలు, కస్టమర్‌ సర్వీ్‌సలో మరింత నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఏ రకంగా చూసుకున్నప్పటికీ మీకు నేను సూటవుతాను. ఇలా ప్రశ్నలను కొద్దిగా ఊహించుకుని వెళితే, నిక్కచ్చిగా, నిర్భయంగా సమాధానాలు చెప్పే వీలు ఉంటుంది.

ప్ర: మా రిటైల్‌ సంస్థలో ఎందుకు పని చేయాలని అనుకుంటున్నావు?
జ: రిటైల్‌ అనే కాదు, ఏ కంపెనీ నుంచైనా ఇటువంటి ప్రశ్న ఎదుర్కోవాల్సి రావచ్చు. ‘వై’ అన్నదో సర్వసాధారణమైన ప్రశ్న. సమాధానానికి ముందు అక్కడి మన ఉద్యోగ స్వరూప స్వభావాలను తెలుసుకుని మరీ జవాబు చెప్పాలి. బ్రాండ్‌ అండ్‌ డిజైనింగ్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. నేను నమ్మిన కంపెనీలో పని చేయాలంటే నాకు చాలా ఇష్టం.
లేదంటే ఇంకోలానూ సమాధానం చెప్పవచ్చు. నాకు రిటైల్‌లో పని చేయాలని ఉంది. జనాలకు షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. వారితో కలసి పని చేయాలంటే నాకు ఆసక్తి. అందువల్లే మీ బిజినెస్‌ లో ఉద్యోగిగా భాగస్వామిని కావాలని అనుకుంటున్నాను.

ఎస్‌బీఐ కస్టమర్లకు ఊరట



ఎస్‌బీఐ కస్టమర్లకు ఊరట 
  • పెనాల్టీ చార్జీలు 75 శాతం తగ్గింపు
  • ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి
  •  25 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి
ముంబై: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాదారులకు పెనాల్టీ చార్జీల నుంచి భారీ ఊరట కల్పించింది. బ్యాంక్‌ ఖాతాలో కనీస నగదు నిల్వ ఉంచనందుకు గాను విధించే పెనాల్టీ చార్జీలను ఏప్రిల్‌ 1 నుంచి 75 శాతం తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. జరిమానా రుసుము పేరిట భారీగా లాభాలు దండుకుంటున్నారని కస్టమర్లు గగ్గోలు పెట్టిన నేపథ్యంలో బ్యాంక్‌ వెనక్కి తగ్గింది. అయితే, కనీస నగదు నిల్వ పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగించింది. మెట్రో నగరాల్లోని శాఖలకు చెందిన కస్టమర్లకు నెలవారీ కనీస నిల్వ పరిమితిని రూ.3,000గా నిర్ణయించింది. సెమీ అర్బన్‌ బ్రాంచ్‌ల కస్టమర్లకు రూ.2వేలు, గ్రామీణ శాఖల్లోని ఖాతాదారులకు రూ.1,000గా ఉంది. కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్‌ మొదటి ప్రాధాన్యమని, వారి అంచనాలను అందుకునే ప్రయత్నాల్లో భాగంగానే జరిమానా రుసుమును తగ్గించినట్లు ఎస్‌బిఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగ ఎండి పికె గుప్తా పేర్కొన్నారు.
 
గత ఏప్రిల్‌ నుంచి మొదలైన వడ్డన
గత ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌బిఐ పెనాల్టీ చార్జీలను తిరిగి అమలులోకి తెచ్చింది. తొలుత మెట్రో నగరాల్లోని బ్రాంచ్‌ కస్టమర్లకు కనీస నిల్వ పరిమితిని రూ.5,000గా నిర్ణయించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడంతో గత అక్టోబర్‌లో ఈ పరిమితిని రూ.3వేలకు తగ్గించడంతోపాటు జరిమానా రుసుము విషయంలోనూ స్వల్ప ఊరట కల్పించింది. అయినప్పటికీ గత ఏడాదిలో ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు పెనాల్టీ చార్జీల రూపంలో బ్యాంక్‌కు రూ.1,771.67 కోట్ల ఆదాయం లభించింది. ఈ మొత్తం బ్యాంక్‌ రెండో త్రైమాసిక లాభం కంటే అధికం. బ్యాంక్‌ తాజా నిర్ణయంతో ఆదాయానికి భారీగా గండి పడనుంది.
 
41 కోట్ల పొదుపు ఖాతాలు
ప్రస్తుతం ఎస్‌బిఐలో 41 కోట్ల మంది కస్టమర్లున్నారు. జరిమానా రుసుము తగ్గిం పు నిర్ణయంతో 25 కోట్ల మంది కస్టమర్లకు లబ్ధి చేకూరనుంది. బ్యాంక్‌ తమ ఖాతాదారులకు సాధారణ సేవింగ్‌ అకౌంట్‌ను బేసి క్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బిఎ్‌సబిడి) మారే అవకాశం కల్పిస్తోందని గుప్తా తెలిపారు. బిఎ్‌సబిడితో పాటు జన్‌ధన్‌ ఖాతాలకు పెనాల్టీలు వర్తించవు. కాగా ఖాతాల్లో కనీస నిల్వ ఉంచ లేదన్న కారణంతో ఎస్‌బిఐ దాదాపు 41.16 లక్షల ఖాతాలను క్లోజ్‌ చేసింది.
 
ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే తక్కువే..
ఎస్‌బిఐ ప్రస్తుతం విధిస్తున్న పెనాల్టీ చార్జీలు ప్రైవేట్‌ బ్యాంక్‌లతో పోలిస్తే మాత్రం తక్కువే. మెట్రో, అర్బన్‌ ప్రాంతాల్లో ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌ బ్రాంచీల్లో నెలవారీ కనీస నిల్వ పరిమితి రూ.10వేలు. ఖాతాలోని నగదు నిల్వ కనీస స్థాయి కంటే తగ్గిన పక్షంలో ఐసిఐసిఐ బ్యాంక్‌ రూ.100తోపాటు తగ్గిన మొత్తంలో 5 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తోంది. హెచ్‌డి ఎ్‌ఫసి బ్యాంకైతే ఏకంగా రూ.600 వరకు పెనాల్టీ విధిస్తోంది.
 
ఎటిఎం లావాదేవీల్లో నష్టపోతున్నాం..
సేవింగ్స్‌ ఖాతాలపై ఎస్‌బిఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ గత నెలలో స్పందిస్తూ.. వీటి లావాదేవీల నిర్వహణ వ్యయం అధికంగా ఉంటుందని అన్నారు. ఎస్‌బిఐ కస్టమర్‌ తన డెబిట్‌ కార్డును ఇతర బ్యాంక్‌ ఎటిఎంలో ఉపయోగించినప్పుడు, ఎస్‌బిఐ ఆ బ్యాంక్‌కు రూ.17 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇలా ఏటా రూ.1500 కోట్ల మేర ఇతర బ్యాంకులకు చెల్లించాల్సి వస్తోందని, ఈ ఖర్చులను ఏదో రూపంలో రికవర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

జంషెట్జీ టాటా - ఒక గొప్ప పారిశ్రామిక వేత్త




భారత పారిశ్రామిక రంగానికి నడకలు నేర్పిన జంషెట్జీ టాటా!

అప్పటికే బ్రిటిషర్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్న భరత మాత విలవిల్లాడిపోతోంది. తనలోని సహజ వనరులన్నింటినీ చేజిక్కించుకునే క్రమంలో బ్రిటిషర్లు పన్నని పన్నాగం అంటూ లేదు. చేయని దురాగతం లేదు. తెల్లదొరల దుర్మార్గ పాలనలో ఛిన్నాభిన్నమైన తన బిడ్డలు ఒక్కటై, శత్రువును తరిమికొట్టేందుకు ఎప్పుడెప్పుడు కదులుతారా? అంటూ చూస్తున్న సమయంలో...1839, మార్చి 3న భరత మాతకు ఓ బిడ్డ జన్మించాడు. తనను విశ్వ వాణిజ్య విపణిలో సమున్నత స్థానంలో నిలపగల సత్తా ఆ బిడ్డ సొంతమని ఆమెకు తెలుసు. అయితే అందుకోసం కాస్త సమయం పడుతుందని కూడా తెలిసిన భరత మాత, ఆ బిడ్డకు జాగ్రత్తగా నడకలు నేర్పింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆ బిడ్డ, తన తల్లి రుణం తీర్చుకున్నాడు. ఆమెను విశ్వ వాణిజ్య విపణిలో సమున్నతంగా నిలపడమే కాక, తమపై ఆధిపత్యం చెలాయించిన నోళ్లతోనే పొగడ్తలూ వెల్లువెత్తేలా చేశాడు. అతడే భారత వ్యాపార రంగ నవ వైతాళికుడు... జంషెట్జీ టాటా.

19 ఏళ్లకే గ్రీన్ స్కాలర్ పట్టా!
గుజరాత్ లోని చిన్న పట్టణం నవ్సారిలో పార్సీ మత బోధకుల ఇంట జంషెట్జీ టాటా జన్మించారు. తరాలుగా వస్తున్న మత బోధకుల వృత్తిని వదిలేసి, ఆ తరహా కుటుంబ కట్టుబాట్లను కాదని తొలిసారి వ్యాపార రంగం బాట పట్టిన నుస్సర్వాన్జీ టాటా, జీవన్ బాయి టాటాలకు జ్యేష్ఠ సంతానంగా పుట్టిన జంషెట్జీ, 14 ఏళ్ల వయసుకే పదేళ్ల హీరాబాయి దాబూని బాల్య వివాహం చేసుకోవాల్సి వచ్చింది.
సరిగ్గా సిపాయిల తిరుగుబాటు జరిగిన మరుసటి ఏడాది 19 ఏళ్ల వయసులో జంషెట్జీ టాటా, నాటి బాంబే లోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాల నుంచి 1858లో నేటి డిగ్రీతో సమానమైన గ్రీన్ స్కాలర్ పట్టా పొందారు. మరుసటి ఏడాది తండ్రి స్థాపించిన చిన్నపాటి వ్యాపారంలో కుదురుకున్నారు. ఈ క్రమంలో తండ్రి వద్ద వ్యాపార మెళకువలను ఒంటబట్టించుకున్న జంషెట్జీ, 29 ఏళ్ల వయసు వచ్చేసరికి సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధపడ్డారు. కేవలం రూ. 21,000లతో మొదలుపెట్టిన ఈ వ్యాపారం, కలిసి రాకపోగా, ఆయనను కుంగదీసింది. ఈ క్రమంలో జరిగిన తన తొలి ఇంగ్లండ్ పర్యటన, ఆయనకు పాఠాలు బాగానే నేర్పింది. వస్త్ర తయారీ రంగం మెళకువలపై అవగాహననూ పెంచింది. 
తుప్పుపట్టిన ఆయిల్ మిల్లునే కాటన్ మిల్లుగా మార్చేశారు!
వస్త్ర తయారీ రంగంలో భారత పరిశ్రమలకు బంగారు భవిష్యత్తు ఉందని గ్రహించిన జంషెట్జీ, ఆ దిశగా అడుగులు వేశారు. బాంబే పారిశ్రామిక వాడలోని చింక్పోలిలో దివాళా తీసి, మూలనపడ్డ ఓ పాడుబడ్డ నూనె మిల్లును1869లో చేజిక్కించుకున్న ఆయన అలెగ్జాండ్రా మిల్లుగా పేరుమార్చి కాటన్ మిల్లుగా తీర్చిదిద్దారు. అయితే స్వల్ప కాలంలోనే దీనిని వదిలించుకున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మేర లాభాన్ని జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లో పర్యటించి, అక్కడి లాంక్ షైర్ లోని వస్త్ర వ్యాపార రీతులపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. అక్కడి మెషీన్లు, వృత్తి నైపుణ్యాలు ఆయనను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, అక్కడి తీరుతోనే భారత్ లో ప్రయోగాలు చేయాలనే తలంపుతో పర్యటనను ముగించుకుని వచ్చారు. 
సకల సౌకర్యాలుండే ప్రాంతంలోనే ప్రయోగం
ఈ క్రమంలో సొంతంగా జౌళి రంగంలో ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించుకున్న జంషెట్జీ, అందుకు అనువైన ప్రాంతం కోసం వెదకడం మొదలుపెట్టారు. జౌళి రంగానికి కేంద్రంగా ఉన్న బాంబేను మించి మెరుగైన ప్రాంతం ఎక్కడ దొరుకుతుందన్న భావన నుంచి బయటకు వచ్చిన ఆయన, పత్తి సాగు చేసే పొలాలు దగ్గరగా ఉండటంతో పాటు అందుబాటులో రైల్వే జంక్షన్, నీరు, ఇంధనం సమృద్ధిగా లభించే నాగ్ పూర్ ను ఎంచుకున్నారు. 1874లో రూ.1.5 లక్షల పెట్టుబడితో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యూఫ్యాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. మూడేళ్ల తర్వాత 1877, జనవరి 1న బ్రిటన్ రాణి విక్టోరియా, ’ఇంప్రెస్ ఆఫ్ ఇండియా‘ పొగడ్తతో సదరు కంపెనీ ఒక్కసారిగా ఇంప్రెస్ మిల్స్ గా మారిపోయింది. ఇంప్రెస్ మిల్స్ తో జంషెట్జీ, ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 
తీరని కోరికలు మూడే!
1880 నుంచి తాను మరణించిన 1904 వరకు జంషెట్జీ, ఎప్పుడూ ఓ మూడు కలలు కంటూ ఉండేవారు. ఉక్కు కర్మాగారం, జల విద్యుత్ ప్రాజెక్టు, సైన్స్ సంబంధిత అంశాల్లో భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోధనలు చేసే విద్యా సంస్థలను నెలకొల్పాలని ఆయన భావించారు. అయితే అవి సాకారం కాకముందే జంషెట్జీ గతించారు. అయితే మరో చిరకాల వాంఛ అయిన హోటల్ నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయగలిగారు. ఏ స్థాయిలోనంటే, అప్పటిదాకా దేశంలో ఎక్కడా లేనంత నూతనత్వంతో నిర్మించారు.
దాదాపు అప్పుడే రూ.4.21 కోట్ల విలువ చేసే తాజ్ మహల్ హోటల్, అమెరికా ఫ్యాన్లు, జర్మన్ ఎలివేటర్లు, టర్కిష్ టాయిలెట్లు, ఇంగ్లీష్ బట్లర్లతో అత్యంత ఆధునిక హంగులతో 1903లో సేవలందించడం ప్రారంభించింది. అప్పటికి బాంబేలో విద్యుత్ వినియోగిస్తున్న హోటల్ గానూ తాజ్ వినుతికెక్కింది. ఆయన గతించినా, ఆయన ఆశయాలు నిజరూపం దాల్చాయి. అందుకు నిదర్శనమే టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. జంషెట్జీ టాటా ఆశయాలకు ఆయన వారసులు జీవం పోయకపోతే ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చేవే కావు. 
చేయూతలో విశిష్టత
ఛారిటీ సంస్థలకు నిధులు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం జంషెట్జీకి అసలిష్టం లేదు. అయితే సేవా కార్యక్రమాలను ఆయన ఏమాత్రం అలక్ష్యం చేయలేదు. 1892లో జేఎన్ టాటా ఫౌండేషన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసిన ఆయన, కుల, మత, ప్రాంత, జాతి సంబంధిత అంశాలతో ఏమాత్రం సంబంధం లేకుండా భారత విద్యార్థులు ఇంగ్లండ్ లో విద్యనభ్యసింసేందుకు చేయూతనందించారు. ఇది ఎంతగా ఫలితాలిచ్చిందంటే, 1924 వరకు సివిల్ సర్వీసులకు ఎంపికైన ప్రతి ఐదుగురు భారతీయుల్లో, ఇద్దరు టాటా స్కాలర్ షిప్పులతో విద్యనభ్యసించిన వారే నిలిచేంతగా! ఈ దిశలో రూపుదిద్దుకున్నదే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అయితే ఈ విద్యా సంస్థ ఏర్పాటు కార్యరూపం దాల్చడానికి దాదాపు పుష్కర కాలం పట్టింది. 
కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట
తనతో ఏమాత్రం సంబంధం లేని వారికే ఆ స్థాయిలో చేయూతనందించిన జంషెట్జీ, మరి తన కార్మికులకు ఏం చేయలేదా? అంటే, అదో పెద్ద ఇతిహాసమే అవుతుంది. తన కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం ఆయన తీసుకున్న పటిష్ఠ చర్యల కారణంగానే నేడు జంషెడ్పూర్ పారిశ్రామిక కళతో అలరారుతోంది. తాను మరణించడానికి ఐదేళ్ల ముందే, కార్మికుల సంక్షేమం కోసం ఆయన ప్రత్యేకంగా చర్యలకు ఉపక్రమించారు. కార్మికుల నివాసం, ఇతర సౌకర్యాల కోసం సేకరించిన ప్రాంతమే, టాటా కంపెనీలతో పాటు ఎదుగుతూ, టాటాల ఆధ్యుడైన జంషెట్జీ పేరిటే, జంషెడ్పూర్ గా రూపాంతరం చెందిందనే విషయం తెలిసిందే. 
కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చనిపోవడానికి రెండేళ్ల ముందు జంషెట్జీ, తన పెద్ద కుమారుడు దొరాబ్ టాటాకు ఓ లేఖ రాశారు. కార్మికుల కాలనీలో వెడల్పాటి రోడ్లు, అత్యంత వేగంగా పెరిగి నీడనిచ్చే చెట్లు నాటాలని ఆ లేఖలో సూచించారు. అంతేకాక కార్మికులు సేదదీరేందుకు భారీ విస్తీర్ణంలో పచ్చిక బయళ్లను, తోటలను ఏర్పాటు చేయడంతో పాటు ఫుట్ బాల్, హాకీ  తదితర ఆటలు, పార్కుల కోసం కూడా భారీ విస్తీర్ణంలో ఖాళీ స్థలాలను కేటాయించాలని కూడా సదరు లేఖలో జంషెట్జీ సూచించారంటే, ఆయన ముందు చూపు ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఇక కార్మికుల భవిష్యనిధి, గ్రాట్యూటీ తదితరాలు భారత్ లో చట్టబద్ధమయ్యే సమయానికి చాలాకాలం ముందే టాటా కార్మికులకు అందించిన ఘనుడు జంషెట్జీ టాటా.